జీవితంలో ఎదురయ్యే కల్లోలాలకు పూర్వజన్మ కర్మలే కారణమా?
ఒక వ్యక్తి పాపాలు చేశాడు అనుకుందాము. అతను చనిపోయిన తరువాత, అతనుచేసిన పాప కర్మలకు తగిన శిక్షలను నరకంలో అనుభవించాడు. నరకంలో పొందిన శిక్షల వలన, ఆ పాప కర్మకు కారణమైన అతనిలో ఉన్న దుర్గుణం యొక్క తీవ్రత తగ్గుతుంది. కాని అది పూర్తిగా అయితే మాత్రం తొలగిపోదు. ఆ దుర్గుణానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు ఆత్మలో నిక్షిప్తం అయ్యి ఉంటాయి. ఒక చెడుకర్మ లేదా పాపకర్మ చేసినందుకు అనుభవించిన శిక్ష వలన తనలో ఉన్న దుర్గుణం తొలగిపోదు. ముల్లును ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అదే విధంగా, దుర్గుణమును, దుర్భుద్ధిని సద్బుధ్ధితో మాత్రమె పూర్తిగా తొలగించగలము.
ఉదాహరణకు, ఒక దొంగను ఎంత శిక్షించినా సరే, అతనిలో ఉన్న దొంగ స్వభావం పూర్తిగా పోదు. మళ్ళీ దొంగతనం చేస్తే, మళ్ళీ శిక్షిస్తారేమో అన్న భయంతో దొంగతనం చేయడానికి జంకుతాడేమో గాని, అతనికి దొంగ బుద్ధి పూర్తిగా మాత్రం తొలగిపోదు. అందుకే, జైలు నుండి బయటకు రాగానే, అతను మళ్ళీ కొన్ని రోజులకు దొంగతనం చేయడం మొదలు పెడతాడు. దొంగతనం చేయడం తప్పు అని ఆ దొంగకి అర్థం అయినపుడు, అనగా ఆ సద్భుద్ది కలిగినపుడు మాత్రమె ఆ దొంగ దొంగతనాలు చేయడం మానేస్తాడు. అతనికి ఒక సద్గురువు లభించి, ఆ గురువు ద్వారా నిజమైన జ్ఞానం లభిస్తే, ఆ పాప కర్మ యొక్క గుణం పూర్తిగా తొలగిపోతుంది. ఒకప్పుడు దొంగతనాలు చేస్తూ దొంగగా ఉండే వాల్మికి , నారదమహర్షి భోధించిన సత్య జ్ఞానం వలన వాల్మికి మహర్షిగా మారాడు గాని, జైలుకి వెళ్లి పోలిసుల చేతిలో శిక్షలు అనుభవించినందుకు కాదు.
గుణం అనేది ఒక జ్ఞానం. ఇదివరకు చెప్పినట్టుగా, తప్పుడు జ్ఞానాన్ని కేవలం సరైన జ్ఞానం ద్వారానే తొలగించవచ్చు. పూజలు చేయడం ద్వారానో. జపాలు చేయడం ద్వారానో, భజనలు చేయడం వల్లనో పుణ్యం పొందవచ్చు, మనస్సును శాంతిమ్పచేసుకోవచ్చు గాని, వారిలో ఉన్న చెడు బుద్ధిని మాత్రం తొలగించుకోలేరు. కాని, ఆ పాపాలకు కారణమైన అజ్ఞానాన్ని నిర్మూలించేది మాత్రం సత్యజ్ఞానమే.

మీకు ఇప్పుడు మనస్సులో ఒక సందేహం రావచ్చు. ఈ చెడు జ్ఞానం, దుర్బుద్ధి ఇవి కూడా కర్మే కదా? అని.
అవును, ఇది కూడా కర్మే. సృష్టిలోని ప్రతీ అంశం కూడా ఒక విధమైన కర్మే. గుణం అనేది మనకు అవగాహన కలిగించే ఆలోచన కావచ్చు లేదా అవగాహన కలిగించే భావన కూడా కావచ్చు. అది కూడా కర్మే. ఒక కర్మ యొక్క అవగాహనను మరొక కర్మ యొక్క అవగాహన మాత్రమే తొలగించగలదు గాని భౌతిక శక్తి తొలగించలేదు. శిక్షించడం, కొట్టడం, కాల్చడం ఇవన్నీ కూడా భౌతిక శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే శరీరం మనస్సుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి పాప కర్మ లేక వికర్మ యొక్క జ్ఞానం యొక్క తీవ్రత ఎలా ఉంటుందో మనస్సులో భయాన్ని కలుగజేస్తుంది గాని ఆ గుణం మూలాల నుండి తొలగిపోదు. సరైన జ్ఞానం, సత్య జ్ఞానం ద్వారా మాత్రమే దుర్గుణం అనేది మూలాల నుండి తొలగిపోతుంది.
ఆ గుణమే తొలగిపోయినపుడు, దానికి సంబంధించిన కర్మ కూడా కనుమరుగు అవుతుంది. అందుకని, దుర్గుణాన్నిసరైన జ్ఞానంతో తొలగించుకుంటే, ఆ దుర్గుణంతో పాటు, దానికి సంబంధించిన కర్మ కూడా మూలాల నుండి కాలిపోతుంది.
“యథైధాంసి సమిద్ధోఽగ్నిః భస్మసాత్కురుతేఽర్జున ।
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ।।”
భావం: ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మము చేయునో, ఓ అర్జునా, జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నిటిని భస్మము చేయును.
ఒక వ్యక్తి పాపములు చేసి నరకంలో శిక్షలు అనుభవించి, మళ్ళీ జన్మించాడు అనుకుందాము. అతను చేసిన పాపాలకు కారణమైన గుణం యొక్క అవశేషాలతోనే జన్మిస్తాడు. ఈ గుణం కలిగి ఉండటం కూడా కర్మే, కావున ఈ కర్మావశేశాలను “కర్మ శేషం” అని పిలుస్తారు. ఆ వ్యక్తి ఈ జన్మలో తనతో పాటు తెచ్చుకున్న గుణం యొక్క అవశేషాలు, అతనితో పాటు ఆ గుణం కూడా పెరిగి పెద్ద వృక్షంలా మారుతుంది. దీని వలన, ఆ వ్యక్తి గత జన్మలో ఎ విధమైన కర్మలు చేసి నరకంలో శిక్షలు అనుభవించాడో, ఈ జన్మలో కూడా మళ్ళీ అవే కర్మలను చేస్తాడు. ఈ జన్మలో చేసిన ఈ పాప కర్మలకి శిక్ష ఈ జన్మలోనే కలుగవచ్చు లేదా చనిపోయాక నరకంలో కూడా కలుగవచ్చు. ఉదాహరణకు, ఒక దొంగ దొంగతనం చేస్తున్నప్పుడే అక్కడికక్కడే యజమానికి దొరికిపోయి బాగా దెబ్బలు తినచ్చు లేదా అదే దొంగని పోలీసులు స్టేషనుకు తీసుకోపోయి కొట్టవచ్చు లేదా దొంగ ఈ రెండు చోట్ల దెబ్బలు తినడం తప్పించుకుంటే, చివరాకరికి నరకంలో అయినా దెబ్బలు తినక తప్పదు.
మనందరికీ కూడా అనంత జన్మల నుండి చేసిన పుణ్య,పాప కర్మల ప్రతిక్రియల కర్మరాశి పేరుకొనిపోయి ఉంది. ఈ కర్మ ఫలితాలను అనుభవిస్తూ తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తే, అది ఇంకా ఎన్నో జన్మలు పట్టవచ్చు, అంతేకాక ఈ సమయంలో మరిన్ని కర్మలు పేరుకుపోయి, అదొక అంతులేని చక్రంలా మిగిలిపోతుంది. కానీ, మన కర్మలన్నిటినీ ఈ జన్మలోనే భస్మం చేసే శక్తి, జ్ఞానానికి ఉందని శ్రీ కృష్ణుడు అర్జునుడికి భరోసా ఇస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ యొక్క జ్ఞానం మరియు దానికి భగవంతునితో ఉన్న సంబంధము తెలుసుకోవటం మనలను శరణాగతి దిశగా తీస్కువెళ్తుంది. భగవంతునికి శరణాగతి చేసినప్పుడు, ఆయన మన యొక్క అనంతమైన జన్మల కర్మలను భస్మం చేసి, భౌతిక బంధముల నుండి విముక్తి చేస్తాడు.గత జన్మలో చేసిన కర్మకు నరకంలో శిక్షను అనుభవించి, ఆ కర్మ శేషమును ఆత్మ మళ్ళీ భూమిపైకి మోసుకొస్తుంది. ప్రస్తుత జన్మలో మన జీవితంలో జరిగే కల్లోలాలకు కారణం మనం గత జన్మలో చేసుకున్న కర్మలే కారణంగా చెప్పవచ్చు.
జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించుకోదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును. గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Ph: 9846466430
